అమరావతి/శ్రీకాకుళం జిల్లా
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
జగన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారు
– వ్యవసాయ బిల్లులపై ఢిల్లీలో మద్దతు
-గల్లీలో జగన్నాటకాలు ఎవరిని మోసం చేయడానికి?
★ కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఏకపక్షంగా మద్దతు తెలిపారు.
★ ఆనాడు బీజేపీ ఎంపీల కంటే ఎక్కువగా వ్యవసాయ బిల్లులను సమర్థించారు.
★ మీ కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారు.
★ ఢిల్లీలో మద్దతు-గల్లీలో జగన్నాటకాలు ఎవరిని మోసం చేయడానికి?
★ తెలుగుదేశం పార్టీ ఆనాడు బిల్లును సమర్ధిస్తూనే సవరణలు ప్రతిపాదించింది.
★ తెలుగుదేశం ఆ సవరణలనే నేటికీ కోరుతోంది.
★ కానీ సవరణలు కోరే వారిపై ఆనాడు విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు నిందలు వేశారు.
★ ఇవాళ జే-టర్న్ తీసుకుని వంకర టింకరగా వ్యవహరిస్తున్నారు.
★ రాష్ట్ర రైతాంగం వైసీపీ కపట నాటకాన్ని గమనించదని భ్రమ పడుతున్నారు.
★ టీడీపీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రైతుల పక్షానే పోరాడుతుంది.
★ టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధిరేటు సాధించి ఆదర్శంగా నిలవడం జరిగింది.
★ అన్ని విధాల వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాం.
★ నేడు వైసీపీ సున్నావడ్డీలోనూ, పంటల బీమాలోనూ, పంట నష్టపరిహారం చెల్లించడంలోనూ రైతులను మోసం చేసింది.
★ ఇరిగేషన్, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో తక్కువగా నిధులు కేటాయించారు.
★ ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల భూములను లాక్కున్నారు.
★ రైతు ద్రోహిగా మారిన వైసీపీ.. వారి రైతాంగ వ్యతిరేక చర్యల నుంచి దృష్టి మరల్చేందుకు టీడీపీపై నిందలు వేస్తున్నారు.
★ వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి గారు తమ విధానాలతో బహిరంగ ప్రకటన చేయాలి.
★ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు మార్చుకోవాలి.
★ ఇటీవల నివార్ తుఫాను సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల కార్చిన మొసలికన్నీరు నిదర్శనం.
★ పంట బీమా కట్టకుండా కట్టానని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి.. రాత్రికి రాత్రి రూ.590 కోట్లు చెల్లించి, రైతులను మోసం చేశాడు.
★ ఆరుగాలం ఎండనక, వాననక శ్రమించే రైతుకు అండగా నిలబలడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
★ కనీస మద్దతు ధర(MSP) అనేది హామీగా కాకుండా చట్టబద్దమైన హక్కుగా ఉన్నప్పుడే రైతుల ప్రయోజనాలకు భద్రత కలుగుతుంది.
★ మార్కెట్ యార్డులను కొనసాగించి వాటిని పటిష్టం చేస్తేనే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
★ అలాగే అవసరమైన సమయంలో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉండాలి.
★ వ్యవసాయ చట్టాలకు రాజ్యసభలో తెలుగుదేశం పక్షనేత పై సవరణలు ప్రతిపాదించారు. ఇవి మరోమారు ప్రతిపాదిస్తున్నాం.
★ ఈ బిల్లుల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎవరికి అమ్మాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ కొరవడే అవకాశం ఉంది.
★ ఏపీఎంసీల్లో లోటుపాట్లుంటే సవరించాలే కానీ.. నిర్వీర్యం చేయడం సరికాదు.
★ మరోవైపు చిన్న, సన్నకారు రైతుల పంటల కొనుగోలుకు రక్షణకు సంబంధించి బిల్లులో ఉన్న నిబంధనలు అస్పష్టంగా ఉన్నవి.
★ రైతు ఆత్మహత్యలను నివారించాలంటే వారికి భరోసా కల్పించాలి.
★ రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉన్నది.
★ రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పంట నష్ట పరిహారం, పంట బీమా, మద్దతు ధర కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మరోవైపు వ్యవసాయ చట్టాలకు ఎలాంటి సవరణలు ప్రదిపాదించకుండా ఆమోదించారు.
★ దీన్ని మరుగుపరచడానికి సవరణలు ప్రతిపాదించిన తెలుగుదేశంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.
★ రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి.
★ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీపడే ప్రసక్తే లేదు.