అమరావతి
తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం వివరాలు..
పాలకుల అబద్ధాలతో, రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది.
– రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.
– అన్నదాతలకు సాయం చేయకుండా అబద్ధాలు చెబుతున్న పాలకుల తీరుతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది.
– రైతాంగానికి చేసే సాయం మొదలు, పంటనష్టం లెక్కలు, ధాన్యం కొనుగోలు, అన్నింటిలో ముఖ్యమంత్రి అబద్ధాలే చెబుతున్నాడు.
– రెవెన్యూ యంత్రాంగం చేతితో ఉంచుకొనికూడా, భూ పట్టాదారులను, అనుభవదారులను గుర్తించడంలో దద్దమ్మ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
– గతప్రభుత్వం 15లక్షలమంది కౌలురైతులను గుర్తిస్తే, ఈప్రభుత్వం వారి సంఖ్యను లక్షా 53వేలకే పరిమితం చేసింది.
– ప్రభుత్వ సొమ్ము రూ.3వేలకోట్లు అమూల్ సంస్థకు కట్టబెట్టిమరీ, రాష్ట్రంలోని పాడిరైతుల సహాకార సంఘాలను నిర్వీర్యం చేయడానికి జగన్ సిద్ధమయ్యాడు.
– హెరిటేజ్ పై కోపంతో, రాష్ట్రంలోని చిన్నచిన్న డెయిరీలను, తన వర్గానికి చెందిన వారి పాలసేకరణ సంస్థలను జగన్ నాశనం చేస్తున్నాడు.
– తన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఆర్.బీ.కే కేంద్రాల ద్వారా పాలసేకరణ అంటూ జగన్ అమూల్ తో ఒప్పందం చేసుకున్నాడు.
★ రాష్ట్రంలో రైతులపరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, పాలకుల తీరుతో రైతాంగం దిక్కు తోచని స్థితిలో ఆకాశం వైపు చూస్తోందని, టీడీపీనేత, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వాపోయారు.
★ సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
★ అతివృష్టి, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, బాధ్యతనుంచి తప్పించుకోవాలని చూస్తుంటే, ముఖ్యమంత్రి మాట్లాడినప్రతిసారీ అబద్ధాలే చెబుతున్నాడన్నారు.
★ రైతాంగానికి పెద్దఎత్తున మేలుచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, మంత్రులు, అబద్ధాలతో రైతులను మభ్యపెట్టడానికి చూస్తున్నారన్నారు.
★ రైతాంగాన్ని మంత్రులు ఎంతచులకనగా చూస్తున్నారోవారి వ్యాఖ్యలే చెబుతున్నాయని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
★ వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలెక్కింపు, ధాన్యం కొనుగోలు, కౌలురైతులను ఆదుకోవడంలో, రైతుభరోసా సాయంలో రాష్ట్రప్రభుత్వం అబద్ధాలమీద అబద్ధాలే చెబుతోందన్నారు.
★ ధాన్యం కొనుగోలులో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ప్రకటించిన రూ.1415రూపాయలకు ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా జరగడం లేదన్నారు.
★ అప్పులపాలైన రైతులు తమధాన్యాన్ని రూ.900, రూ.1000లోపు ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు.
★ రైతులకు ధాన్యాన్ని నిల్వచేసుకునే సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో, చేసేది అయినకాడికి కల్లాల్లోనే అమ్ముకుంటున్నారన్నారు.
★ కౌలు రైతుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం వారికి తీరని అన్యాయం చేస్తోందన్నారు.
★ గతప్రభుత్వం 15లక్షలమంది కౌలురైతులను గుర్తిస్తే, ఈప్రభుత్వం వారిసంఖ్యను లక్షా53వేలకే పరిమితంచేసిందని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
★ పాలకుల చేతిలో రెవెన్యూ యంత్రాంగం ఉన్నప్పటికీ, పట్టాదారు, భూ అనుభవదారులను గుర్తించడంలో ఈ దద్దమ్మ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
★ కౌలురైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, రైతుభరోసా వంటివేవీ అందడం లేదని, తద్వారా వారు నష్టపోతున్నారన్నారు.
★ ఇప్పటికైనా రైతులను, కౌలురైతులను ప్రభుత్వం గుర్తించి, వారికి న్యాయం చేయాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు.
★ కౌలురైతులకు అన్యాయం జరిగిన పక్షంలో వారిపక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగురైతు విభాగం ఉద్యమిస్తుందని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.