అమరావతి/ఏలూరు
ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం కనిపిస్తోంది.
- టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు
★ సురక్షితమైన తాగునీరూ ఇవ్వలేని జగన్రెడ్డి పాలన వల్ల 150 మందికి పైగా పిల్లలు, పెద్దలు తీవ్ర అస్వస్థతతో విలవిల్లాడుతున్నారు.
★ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం, వైద్యారోగ్యశాఖా మంత్రి సొంత నియోజకవర్గమైన ఏలూరులో తాగునీరు కలుషితం అయిందంటే ఎంత బాధ్యతారాహిత్యమో అర్థం అవుతోంది.
★ ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం కనిపిస్తోంది.
★ 18 నెలల పాలనలో కనీసం రక్షిత మంచినీటి ట్యాంకులూ శుభ్రం చేయించని నిర్లక్ష్యం ఫలితమే ఈ విషాదం.
