అమరావతి (కృష్ణా జిల్లా/విజయవాడ)
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
విజయవాడ పరిధిలో పేట్రేగుతున్న వైసీపీ
– ఓటింగ్ జరగకుండా కొన్ని డివిజన్లలో బెదిరింపులు
★ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార వైసీపీ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయి.
★ ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను రక్తసిక్తం చేస్తున్నారు.
★ దాడులు.. దౌర్జన్యాలతో ప్రజలు ఓటు వేసేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు.
★ 8వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి రజనీ భర్త కొత్తపల్లి రాజశేఖర్ తెలుగు దేశం పార్టీ సానుభూతి పరులపై దాడికి పాల్పడ్డారు.
★ దేవినేని అవినాశ్ ప్రోద్బలంతో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్ శాతం పెరగకుండా చేయడం అత్యంత హేయం.
★ 59వ డివిజన్ పోలింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నిసా కుమారులు దాదాగిరి చేస్తూ ఓటర్లను భయపెడుతున్నారు.
★ ఫ్యాన్కు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.
★ పసుపు రంగు చొక్కాతో వచ్చాడనే నెపంతో ఓ పౌరుడిపై దాడికి పాల్పడ్డారు.
★ 59వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సుల్తానా కుటుంబ సభ్యులంతా జనరల్ ఏజెంట్ పాస్తోె పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారు.
★ ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసి.. రక్త సిక్తం చేస్తున్న వైసీపీ అనుచరులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి.