అమరావతి (చిత్తూరు జిల్లా/తిరుపతి)
తిరుపతి పార్లమెంటు టిడిపి నేతలతో తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ వివరాలు..
పాల్గొన్న టిడిపి గ్రామ కమిటీ, బూత్ కమిటీల ప్రతినిధులు, ఇన్ ఛార్జ్ లు..
★ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టిడిపి గ్రామ కమిటీ, బూత్ కమిటీల ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
★ వైసిపి దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది.
★ పరిటాల భోగిమంటల్లో రైతు వ్యతిరేక జీవోల దగ్దం, ఛలో రామతీర్థం ఆందోళనలకు హాజరైన జనసమూహాలే నిదర్శనం.
★ తెలుగుదేశం సెక్యులర్ పార్టీ. ఏ ప్రార్ధనా మందిరంపై దాడి జరిగినా టిడిపి సహించదు.
★ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అన్నిమతాలను టిడిపి గౌరవించింది, ప్రజల మనోభావాలను కాపాడింది.
★ జగన్ రెడ్డి సిఎం అయ్యాక 150పైగా ఆలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం చేశారు.
★ బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు.
★ విగ్రహాలను ధ్వంసం చేసి క్రీస్తు గ్రామాలుగా చేస్తున్నామని, తానే వందలాది దేవుళ్ల విగ్రహాలను కాలితో తన్నానని ఒక ఫాస్టర్ చెప్పిన వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యం.
★ గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో 7కొండలను 2కొండలకు తగ్గించడంపై ప్రజలంతా ఖండించారు.
★ నేనే స్వయంగా కాలినడకన తిరుమల వెళ్లాను, భక్తుల మనోభావాలను కాపాడాం.
★ ఇప్పుడు మళ్లీ జగన్ రెడ్డి సిఎం అయ్యాక తిరుమల తిరుపతి పవిత్రతకు కళంకం తెచ్చారు.
★ భార్య బైబిల్ పట్టుకుని తిరిగే వ్యక్తిని టిటిడి ఛైర్మన్ చేశారు, ఒకే సామాజిక వర్గం పెత్తనంగా టిటిడిని మార్చారు.
★ యధేచ్చగా మద్యం- మాంసం విక్రయాలు, అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు.
★ ఎస్వీబిసి ఛానల్ ఛైర్మన్ అసభ్య ప్రవర్తన, భక్తులకు అసభ్య వీడియో లింకులు పంపడం, ఆర్టీసి టిక్కెట్లపై జెరూసలెం యాత్ర విశేషాలు, తిరుమల కొండపై శిలువ గుర్తులు… తిరుపతిలో వీళ్లు చేయని అపచారం లేదు.
★ కాణీపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, అంతర్వేది, సింహాచలం.. దేనినీ వదిలి పెట్టలేదు, పుణ్యక్షేత్రాలు అన్నింటిపై దాడులు చేస్తున్నారు.
★ 13జిల్లాలలో వందలాది విగ్రహాలను విధ్వంసం చేశారు.
★ దేవుళ్ల రథాలకు నిప్పుపెట్టడమే కాదు, చివరికి ముస్లిం దర్గాలకు కూడా నిప్పుపెట్టే నీచానికి దిగజారారు.
★ ఆలయాలపై దాడులు, విధ్వంసాలపై ఒకరోజు ఉన్మాదుల పని అని చెప్పిన డిజిపి మరురోజే టిడిపి, బిజెపి వాళ్లే కారణమని చెప్పడం దిగజారుడుతనం.
ప్రజల ప్రాణాలు తీయడమే వైసిపి నిత్యకృత్యమైంది..
★ ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, అత్యాచారాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చూడలేదు.
★ 20నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు, 16మంది టిడిపి కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు, 400మంది మహిళలపై అఘాయిత్యాలు….
★ తంబళ్లపల్లిలో గంగిరెడ్డి హత్య, పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి…
★ నిన్న సుళ్లూరుపేటలో టిడిపి నాయకుడు వెంకటేష్ పై 15మంది కత్తులతో దాడి ..
★ ప్రశాంతమైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా హింసా విధ్వంసాలు చేస్తున్నారు.
★ రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేశారు.
★ ఉన్మాదుల రాజ్యంగా మార్చారు.
★ భవిష్యత్తులో తనపై పోటీ చేస్తాడనే అక్కసుతోనే బిటెక్ రవిపై తప్పుడు కేసులు పెట్టి సిఎం జగన్ రెడ్డి వేధిస్తున్నారు.
★ హత్యాచారానికి గురైన ఎస్సీ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం హేయం.
★ ఇటువంటి ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను రాష్ట్రచరిత్రలో చూడలేదు.
★ వీళ్లా మంత్రులు, వీళ్లా ఎమ్మెల్యేలు అని ప్రజలే నిలదీస్తున్నారు.
★ ఒక ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలోనే బెదిరిస్తాడు, తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తాడు.
★ ఇంకో ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఏకంగా మహిళా ఎంపిడివో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ధర్నా చేయడం…
★ మరో ఎమ్మెల్యే తన ఆక్రమణలో 7ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నిస్సిగ్గుగా చెప్పడం, ఈ రోజు బూతుల మంత్రి, ప్రతిపక్ష నాయకుడిని ఇంటికొచ్చి తంతాననడం…
వైసిపి రౌడీ రాజకీయాలకు నిదర్శనం..
★ గుడివాడలో మంత్రి పేకాట దందా పట్టుకున్న ఎస్సై ఆత్మహత్య… అది ఆత్మహత్యనా, హత్యనా, అనుమానాస్పద మరణమా..?
★ ఇళ్లస్థలాల్లో అవినీతిని బైటపెట్టిన చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను పిలిపించి ఇళ్లస్థలాల ప్రాంగణంలోనే హత్య చేయడం, గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలు బైటపెట్టిన కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని గ్రామ సభ జరిగిన గుళ్లోనే హతమార్చడం..
★ రోడ్లు వేయలేదని గిద్దలూరు ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త అనుమానాస్పద మరణం..
★ మద్యం నాసిరకం బ్రాండ్లను నిలదీసిన పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి..
★ అబ్దుల్ సలామ్ కుటుంబంతో సహా రైలుకింద పడి సామూహిక ఆత్మహత్యలు..
★ ఎస్పీ కార్యాలయం ఎదుటే అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం, …
★ వైసిపి రాక్షసకాండకు ప్రత్యక్ష సాక్ష్యాలు..
★ ఈ అరాచకాలు అన్నింటికీ జగన్ రెడ్డే కారణం..
★ శాంతిభద్రతలు అధ్వానం కావడానికి డిజిపినే కారణం..
★ పదవుల కోసం వైసిపితో కుమ్మక్కైన కొందరు పోలీసులే కారణం..
★ వీళ్ల అండదండలు చూసుకునే రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి.
ఎన్టీఆర్ కూడా ఇటువంటి దాడులు, విధ్వంసాల బాధితుడే..
★ గతంలో ఎన్టీఆర్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు, దగ్దం చేశారు.
★ అయినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడాం.
★ ధైర్యానికి మారుపేరు ఎన్టీఆర్..
★ ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి టిడిపి కార్యకర్త మనోధైర్యంతో ముందడుగు వేయాలి.
★ పోరాటం టిడిపికి కొత్తకాదు, పోరాటాలతోనే టిడిపి రాటుతేలింది.
★ పోరాడేవాళ్లే నాయకులుగా ప్రజల గుండెల్లో ఉంటారు.
★ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేయాలి.
★ జగన్ రెడ్డి శిశుపాలుడిని మించిపోయాడు, 20నెలల్లోనే వందలాది తప్పులు చేశాడు..
★ వైసిపి పతనానికి తిరుపతి ఉప ఎన్నికతో నాంది పలకాలి.
★ తిరుపతి నుంచే వైసిపి దాడులకు అడ్డుకట్ట పడాలి.
★ హింసా విధ్వంసాలను వెంకటేశ్వర స్వామి సహించడు.
★ తిరుపతిలో టిడిపి గెలుపుతో వైసిపి విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయాలి.
★ ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు మింగేస్తున్న పార్టీకి ఓటేస్తారా ఎవరైనా..?
★ టిడిపి హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధించే వైసిపికి ఓటేస్తారా..?
★ ముంపు భూములు, స్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..?
★ నెలకు రూ 750 పించన్ ఎగ్గొట్టిన పార్టీకి పించన్ల లబ్దిదారులు ఎవరైనా ఓటేస్తారా..?
★ మీటర్లు పెట్టే పార్టీకి ఏ ఒక్క రైతు అయినా ఓటేస్తారా..?
★ రైతు భరోసా ఏడాదికి రూ 6వేలు ఎగ్గొట్టిన పార్టీకి ఏ రైతు అయినా ఓటేస్తారా..?
★ హార్టీ కల్చర్ సబ్సిడి ఎగ్గొట్టిన వైసిపికి ఉద్యాన రైతులు ఓటేస్తారా..?
★ పరిశ్రమలు, ఉద్యోగాలు పోగొట్టిన పార్టీకి యువతరం ఎవరైనా ఓటేస్తారా..?
★ అత్యాచారాల రాష్ట్రంగా ఏపిని చేసిన వైసిపికి మహిళలు ఎవరైనా ఓటేస్తారా..?
★ బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దాడులు చేసే పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటేస్తారా..?
★ వీటన్నింటినీ వివరించి ప్రజలను చైతన్యపరచాలి.
★ దేశవిదేశాలు తిరిగి అనేక కంపెనీలు తిరుపతి, నెల్లూరుకు తెచ్చాం, లక్షా 70వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించాం, ఇప్పుడా కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారు, పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయి.
★ యువత భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారు.
★ తిరుపతి, నెల్లూరులో తెచ్చిన పరిశ్రమలను (పెప్సికో, కాడ్బరీ, ఇసుజు, హీరో మోటాకార్ప్, రిలయన్స్, కోబాల్కో….థర్మల్ పవర్ టెక్, కోకోకోలా, క్రిబ్కో…) గుర్తు చేయాలి.
★ గత 20నెలల్లో ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ప్రశ్నించాలి.
★ టిడిపి హయాంలో పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టులను (అడవిపల్లి రిజర్వాయర్, అవుకు టన్నెల్… సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి, సోమశిల లిఫ్ట్ ఫస్ట్ ఫేస్, కండలేరు లిఫ్ట్…) గుర్తుచేయాలి.
★ ఒక్కటైనా ప్రాజెక్టు వైసిపి వచ్చాక పూర్తిచేశారా అని నిలదీయాలి.
★ వైసిపి నిర్వాకాలపై యువతరమే ధ్వజమెత్తాలి.
★ జగన్ గ్యాంగ్ దుర్మార్గాలపై ఇంటింటి ప్రచారం చేయాలి.
★ యువతరమే టిడిపి ప్రచార బాధ్యత భుజాన వేసుకోవాలి.
★ వైసిపి దుర్మార్గాలపై టిడిపి ధర్మపరిరక్షణ యాత్ర.
★ జనవరి 21నుంచి తిరుపతి పార్లమెంటులో యాత్ర.
★ 10రోజులపాటు 700గ్రామాల్లో ధర్మపరిరక్షణ యాత్రలో వైసిపి దుర్మార్గాలను నిలదీయాలి, అన్నివర్గాల ప్రజలను చైతన్యపరచాలి.
★ తిరుమల తిరుపతి పవిత్రత కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత.
★ న్యాయం, ధర్మం, సత్యం ఎల్లప్పుడూ సజీవం.
★ ఈ మూడింటిని కప్పిపెట్టడం అసాధ్యం.
★ నిజాన్ని కప్పిపెట్టడం, న్యాయాన్ని నిందించడం, ధర్మానికి ద్రోహం చేయడం మహా ఘాతుకం..
★ సత్యానిదే అంతిమ విజయం.
★ అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ దుష్ప్రచారం చేశారు.
★ తమకు అన్యాయం జరిగిందని అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఇన్ సైడ్ ట్రేడింగ్ లేదని న్యాయస్థానం పేర్కొనడమే నిదర్శనం..
★ వైసిపి దుర్మార్గాలు అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
★ బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలన్నీ ఏకమై వైసిపికి బుద్ది చెప్పేలా చేయాలని చంద్రబాబు టిడిపి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
👉 టిడిపి నాయకుల ప్రసంగాలు:
👉 అచ్చెన్నాయుడు(ఏపి టిడిపి అధ్యక్షులు):
★ గత 20నెలల్లో ఒక్క అభివృద్ది పనిలేదు.
★ మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో అన్నివర్గాలకు తీవ్ర వేధింపులు..
★ ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య జగన్ రెడ్డి చిచ్చు పెడ్తున్నారు.
★ టిడిపిని ఇబ్బంది పెట్టడానికి లెక్కలేనన్ని అరాచకాలు చేశారు.
★ టిడిపి 22ఏళ్ల పాలనలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు.
★ టిడిపి కార్యకర్తలకు భయం అనేది తెలియదు.
★ 38ఏళ్లుగా జెండా మోస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది.
★ ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రతి టిడిపి కార్యకర్త వెన్నంటి ఉంటుంది.
★ రేపు ఉదయం తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభిస్తాం.
★ ఎల్లుండి నుంచి టిడిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం.
★ గురువారం తిరుపతి ర్యాలీని విజయవంతం చేయాలి.
👉 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (మాజీ మంత్రి):
★ మంత్రులు, ఎమ్మెల్యేల వీరంగాన్ని ప్రజలే చూస్తున్నారు, బూతుల పంచాంగాన్ని వింటున్నారు.
★ జిల్లా ఎస్పీని వైసిపి ఎమ్మెల్యే బెదిరించడం, రమ్మని సవాల్ చేయడం బరితెగింపునకు నిదర్శనం.
★ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా దోపిడి పేట్రేగిపోయింది.
★ రైతుల నుంచి, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
★ జగన్ రెడ్డి అండ చూసుకునే వీరంతా రెచ్చిపోతున్నారు.
★ తిరుపతి ఉప ఎన్నికలో వైసిపిని ఓడించడమే వీటన్నింటికీ గుణపాఠం.
👉 రామానాయుడు (టిడిఎల్ పి ఉపనేత):
★ తిరుపతి, నెల్లూరు జిల్లాలలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
★ 2జిల్లాలలో రూ లక్షా 70వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తెచ్చాం, 2లక్షల మందికి ఉపాధి కల్పించాం.
★ అవుకు టన్నెల్, అడవిపల్లి రిజర్వాయర్, సోమశిల లిఫ్ట్ ఫస్ట్ ఫేజ్, కండలేరు లిఫ్ట్, సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి పూర్తి చేశాం.
★ వైసిపి వచ్చాక అభివృద్ది పనులన్నీ ఆపేశారు, రాష్ట్ర భవిష్యత్ అంధకార మయం చేశారు అనేది ప్రజలకు వివరించాలి. ఇంటింటి ప్రచారం చేయాలి.
★ ఈనెల 21నుంచి రాబోయే 10రోజులు 70 ప్రచార రథాలతో 700గ్రామాల్లో ప్రచారం జరపాలి.
👉 బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీ కాళహస్తి):
★ రావణాసురుడిగా జగన్ రెడ్డి మారారు.
★ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక రాముడికి, రావణుడికి మధ్య జరిగే ఎన్నిక.
★ వైసిపి ఎమ్మెల్యేల దుర్మార్గాలకు బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్దంగా ఉన్నారు.
★ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
ఈ సమావేశంలో టిడిఎల్ పి ఉపనేత రామానాయుడు, తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, పాశం సునీల్ కుమార్, నెలవల సుబ్రమణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, సుగుణమ్మ, జెడి రాజశేఖర్ తదితరులు మాట్లాడారు.