శ్రీకాకుళం జిల్లా
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కిమిడి కళా వెంకట్రావు పత్రికా ప్రకటన వివరాలు..
నోటిఫికేషన్ విడుదలతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు షేక్
– ఉద్యోగ సంఘాలు రాజకీయ నేతల్లా మాట్లాడటం హేయం
★ రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎస్ఈసీ కమీషన్ పై వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
★ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ మంత్రుల స్థాయిని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్దం.
★ వైసీపీ నాయకులకు, కోర్టులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ బద్దమైన సంస్థలంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.
★ వైసీపీ దుర్బుద్దిని ఉద్యోగ సంఘాలకు ఆపాదిస్తున్నారు.
★ వైసీపీ నాయకులు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు?
★ అంత ప్రజాబలం ఉందని చెప్పుకుంటున్న జగన్ ఎన్నికంటే ఎందుకు వణుకుతున్నారు?
★ నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లో కదలిక ఎందుకు మొదలయ్యింది?
★ జగన్ నియంతృత్వ పోకడలను ప్రజలు చెప్పులతో కొట్టి పిడకల దండలు వేసే రోజులు దగ్గరపడ్డాయని మీ ఆందోళనతో అర్ధమవుతుంది.
★ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఏనాడు మాట్లాడని ఉద్యోగుల సంఘం నేడు పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
★ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘమే సుప్రీమని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం మరిచారా?
★ ఉద్యోగుల సంఘం జగన్ తరుపు వత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు గాని ప్రభుత్వ ఉద్యోగుల తరుపున మాట్లాడటం లేదని నేడు ఉద్యోగులే భావిస్తున్నారు.
