అమరావతి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది, శ్రీ పిల్లి మాణిక్యరావు పత్రికా ప్రకటన వివరాలు..
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తనపై జరిగిన దాడిని టీడీపీకి అంటకట్టాలని ప్రయత్నించడం తన చేతకాని తనానికి నిదర్శనం.
– అంతేకాక స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిపై దాడి జరిగినట్టు అబద్ధపు ప్రచారాన్ని చేయాలనుకోవడం తన అవివేకానికి నిదర్శనం.
★ ఈ రాష్ట్రంలో దేశంలో నిజమైన లౌకిక వాద, ప్రజాస్వామిక పార్టీ తెలుగుదేశం పార్టీ.
★ బిజెపి పార్టీ ఈ రాష్ట్రములో తను ఎదగడం కోసం ఆ పార్టీ ఎలాంటి పద్దతులను అవలంబిస్తుందో మేము ప్రస్తుతం ప్రస్తావించదలుచుకోలేదు.
★ భౌతిక దాడులు, కుట్రపూరిత రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమో అందరికి తెలిసిందే.
★ కొలికపూడి శ్రీనివాస్ అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్. అమరావతి ఉద్యమాన్ని అవమానకర రీతిలో మీరు మాట్లాడుతూ… తను దళితుడనే చులకన భావనతో వ్యంగంగా వ్యవహారించడమే కాకుండా ఒక పార్టీకి బానిసని అనటం శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు.
★ తన ఆత్మగౌరవం పబ్లిక్ గా చరకు గురౌతుంటే, తట్టుకోలేక శ్రీనివాస్ ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చు….
★ అది పూర్తిగా నీ ఆధిపత్య, వికార వ్యక్తిత్వానికీ….శ్రీనివాస్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.
★ దీనిలో నువ్వు తెలుగుదేశం పార్టీనీ నిందించడం నీ చేతకాని తనానికి నిదర్శనం.
★ నీవు ఏ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నావో.. ఏ ఉద్యమాలను అవమానిస్తున్నావో… ఏ పార్టీలో ఉండి, ఏ పార్టీ కోసం పని చేస్తున్నావో… నీ నీచపు రాజకీయ సంస్కృతిని… నీ వ్యక్తిగత వ్యవహార శైలి ప్రజలకు అర్థం అవుతుంది.
★ అందుకే నీపై కొలికపూడి శ్రీనివాస్ అలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు.
★ అయినా అలాంటి చర్యలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్ధించదు.
★ కాబట్టి తెలుగుదేశంపై నిందలు వేయాలనే నీ ఆలోచన మానుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తావని, అధికార పార్టీ కుల తత్వం పోకడలను తొలగించుకుంటావని నీకు సూచన చేస్తున్నాము.