అమరావతి (ప్రకాశం బ్యారేజ్)
తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి
★ ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు.
★ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులపై దౌర్యన్యం చేయడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ..
★ విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్య ఉండే ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అన్నారు.
★ ఉపాధ్యాయ బదిలీలలో రాజకీయ ప్రమేయం లేకుండా ఉండటం కోసం కౌన్సిలింగ్ విధానానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చూడితే, జగన్మోహన్ రెడ్డి వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు.
★ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు.
★ ఉపాధ్యాయుల బదిలీలో వైకాపా నాయకులు జోక్యం చేసుకుంటూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.
★ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులను మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది.
★ వెబ్ కౌన్సిలింగ్ లో ఉన్న లోపాలను ప్రశ్నించిన ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
★ ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా సమయానికి డిఎలను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు డిఎలను వాయిదాలలో ఇస్తానని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది.
★ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులలో సిపిఎస్ ను రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు దానిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
★ 11వ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు.
★ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిసిటీ పిచ్చితో పాఠశాలలు తెరిచి వేలాది మంది విద్యార్దులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా చేశారు.
★ నాడు-నేడు కార్యక్రమాలలో ఉపాధ్యాయులను బలవంతంగా పనిచేయించి కరోనా బారినపడేలా చేసి వారి మరణాలకు ప్రభుత్వం కారణమయ్యింది.
★ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలి.
★ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు