తూర్పుగోదావరి జిల్లా (పెద్దాపురం)
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి, శాసనసభ్యులు, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప విలేకరుల సమావేశం వివరాలు..
జగన్రెడ్డి పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
- నిధులు, విధులు ఉన్న 720 నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా ఎలాంటి అధికారాలు లేని 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారని రాజప్ప విమర్శించారు.
- ఈరోజు రాష్ట్రంలో బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ మంత్రులు నోరు మెదపడంలేదని అన్నారు.
★ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టపెట్టారని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప మండిపడ్డారు.
★ వ్యవసాయ బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఏకపక్షంగా మద్దతు తెలిపారని చెప్పారు.
★ ఆనాడు సవరణలు కోరితే విజయసాయరెడ్డి, వైసీపీ నేతలు నిందలు వేశారని గుర్తుచేశారు.
★ ఇవాళ జే-టర్న్ తీసుకుని కపట నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ రైతుల పక్షాన నాడు-నేడు పోరాడేది ఒక్క టీడీపీ మాత్రమేనని అన్నారు.
★ రాష్ట్రంలో వరుస ‘‘ప్రకృతి వైపరీత్యాలతో రైతు కుదేలు అయ్యాడు”.
★ దెబ్బతిన్న అన్నదాత వెన్ను విరుస్తూ……సాకులు చెబుతూ మద్దతు ధర ఇవ్వకుండా అసమర్థ విధానాలతో భీమా ప్రీమియం చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాజప్ప ఘాటుగా విమర్శించారు.
★ ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలూరులో ప్రజలు అంతుపట్టని వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.
★ ప్రభుత్వ అసమర్ధతతోనే ఏలూరులో వింత రోగం బారిన పడి అనేక మంది ఆస్పత్రి పాలయ్యారని వారిని చూస్తేంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
★ కనీస పరిజ్ఞానం లేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు.
★ వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వైద్యం అంటే తెలీదని ఎద్దేవా చేశారు.
★ ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందన్నారు.
★ ఓ పద్దతి ప్రకారం పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాదని తెలిపారు.
★ చేతకాని ప్రభుత్వం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
★ వైకాపా ఎంతసేపు తెదేపా నేతలను దెబ్బతీయాలని చూస్తున్నారు తప్ప.. పాలనపై దృష్టి సారించడం లేదు.
★ ఏలూరు ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
★ ప్రజలకు నమ్మకం కలిగించేలా ఆరోగ్య చర్యలు చేపట్టాలి అని రాజప్ప అన్నారు.
★ ప్రభుత్వానికి అప్పులు చేయడంలో ఉన్న శ్రద్ధ..ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు.
★ ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎందుకు ప్రకటించలేదన్నారు…?*
★ రాష్ట్రంలో తెదేపా హయాంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగింది.
★ బీసీల అభ్యున్నతి కోసం తెదేపా ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేసింది.
★ బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా అనేక పధకాలు ప్రవేశపెట్టడం జరిగింది.
★ రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు ఆనాడు తెదేపా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది.
★ ఈ రోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ భగ్గుమంటున్నాయి.
★ కష్టకాలంలో ధరలు పెంచి దోచేస్తున్న జగన్ రెడ్డి సర్కారు – స్కీముల కోసం సామాన్యుల నెత్తిన ట్యాక్స్ పిడుగు – సంపద సృష్టించడం మాని – అప్పులు చేస్తూ – సామాన్యుల పై భారం మోపుతున్న వైసిపి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని వైసిపి మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
★ పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తున్నట్లు ప్రకటించి వ్యాట్ పెంచారు.
★ సగటున లీటర్ పెట్రోల్ డీజిల్ పై పెంచిన మొత్తంతే ప్రజలపై రూ.500 కోట్ల మేర భారం మోపారు.
★ అడ్డగోలుగా విద్యుత్ స్లాబులు మార్చి రూ. 1500 కోట్ల భారాన్ని బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దారు.
★ ఆర్టీసీ ధరలు సగటున 20% పెంచారు.
★ సామాన్యులపై రూ. 1,000 కోట్ల భారం మోపారు.
★ టీడీపీ స్కీముల్ని రద్దు చేశారు, అన్నా క్యాంటిన్లను మూసేశారు.
★ పండుగ కానుకులు రద్దు చేశారు, ముస్లింలకు రంజాన్ తోఫా ఎగ్గోట్టారు.
★ గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ తీసేశారు.
★ పేదల పొట్టకొట్టి వైసిపి నేతల బొజ్జ నింపుతున్నారు అని రాజప్ప దుయ్యబట్టారు.