తెలుగువారి ఆరాధ్యదైవం, తెలుగువారికీర్తిని, ప్రతిష్టను దేశదేశాలకు విస్తరింపచేసిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్దంతిని పురస్కరించుకుని కువైట్లో తెలుగుదేశం అద్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యములో అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బముగా ఎర్పాటుచేసిన కార్యక్రమములో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొని అన్నగారిని స్మరించుకున్నారు. సుధాకర రావు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్యదైవం భౌతికముగా మనకు దూరమై నేటికి 25 సంవత్సరాలు అయినప్పటికి ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్మరనీయుడని, పేద బడుగు బలహీన వర్గాలకోసం తెలుగుదేశం పార్టీని స్తాపించి ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు దేశ చరిత్రలో నిలిచిపోయాయని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రన్న తెలుగుదేశం పార్టీని పేదల పార్టీగా నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న NTR సేవాసమితి కార్యవర్గ సభ్యులకు, తెలుగుదేశం కువైట్ బి.సి. విభాగం, తెలుగుదేశం కువైట్ ఎస్.సి. విభాగం, తెలుగుదేశం కువైట్ మైనార్టీ విభాగం, చంద్రన్న దళం, జై నారా లోకేష్ టీం అందరికి సుధాకర రావు ధన్యవాదాలు తెలియచేశారు. ఆ తరువాత పి.ఆర్.వో మద్దిన ఈశ్వర్ నాయుడు మాత్లాడుతూ ప్రతి ఒక్క ప్రవాస తెలుగుదేశం కార్యకర్త సోషల్ మీడియాలో ముదుకువచ్చి ప్రస్తుత ప్రభుత్వ దురాగతాలను ప్రశ్నించాలని కోరారు. అధికార ప్రతినిధి బోయపాటి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం గత 18 నెలల్లో లక్షాయాభై వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్నారన్నారు. ఒక రాజధానినే కట్టడానికి నిధులు సమకూర్చలేక మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మరో అధికార ప్రతినిధి నాయనిపాటి విజయ్ మాట్లాడుతూ అన్నగారిని ప్రతి తెలుగోడు ఆదర్సముగా తీసుకోవాలని, ఆయన ప్రజల కోశం పుట్టిన మనిషి అని అన్నారు. ప్రోగ్రాం కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అన్నగారికి భారత రత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమములో ఏనుగొండ నరసింహులు, చుండు బాలరెడ్దయ్య, గంటా గోపి, సుభాన్, ఖాద్సియా నరసింహ, రమేష్, వంశి, మంచూరి శివ, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

